Australia Beach Case: కుక్క చేసిన ఆ చిన్న తప్పే.. ఆ యువతి హత్యకు కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reason Revealed Behind Why Indian Man Killed Australian Woman: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ అయిన ఓ భారతీయ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! 2018లో క్వీన్స్లాండ్లోని వంగెట్టి బీచ్లో టోయా కార్డింగ్లే అనే యువతిని రజ్వీందర్ సింగ్ అనే భారతీయుడు దారుణంగా చంపి భారత్కి పారిపోయాడు. అప్పట్నుంచి అతని కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలిస్తున్నారు. భారత్కి పారిపోయాడన్న విషయం తెలిసి, అతని పట్టించడంలో సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆస్ట్రేలియా కోరింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతడు ఆ అమ్మాయిని ఎందుకు చంపాడన్న మిస్టరీని రివీల్ చేశాడు.
ఇన్నిస్ ఫాయిల్లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే రజ్వీందర్.. హత్య జరిగిన రోజు తన భార్యతో గొడవ పడి, వంగెట్టి బీచ్ వద్దకు వెళ్లాడు. అక్కడ కాసేపు ప్రశాంతంగా సమయం గడుపుదామని అనుకున్నాడు. అయితే.. అదే సమయంలో టోయా కార్డింగ్లే (ఫార్మసీ వర్కర్) తన కుక్కతో బీచ్కు షికారుకి వచ్చింది. రజ్వీందర్ వద్దకు రాగానే.. ఆ కుక్క అతడ్ని చూసి అరవడం మొదలుపెట్టింది. అసలే భార్యతో గొడవపడినందుకు కోపంలో ఉన్న రజ్వీందర్.. ఆ కుక్క మొరవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తన కుక్కని కంట్రోల్లో పెట్టుకోమని, దాని యజమాని అయిన టోయాతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆవేశంతో.. తన వద్ద ఉన్న కత్తితో పొడిచి, టోయాను చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇసుకలో పూడ్చి.. కుక్కను ఒక చోట కట్టేసి.. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. కేవలం కుక్క మొరిగిందన్న కారణంతో.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు రజ్వీందర్ సింగ్.
Also Read
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
హత్య చేసిన రెండ్రోజుల తర్వాత.. అరెస్ట్ భయంతో రజ్వీందర్ సింగ్ తన భార్య, పిల్లల్ని వదిలేసి అక్కడి వదిలేసి భారత్కి పారిపోయి వచ్చాడు. పంజాబ్లో తలదాచుకున్నాడు. అతని అరెస్ట్ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడి ఇంటర్పోల్ను అప్రమత్తం చేసింది. పంజాబీ, హిందీ మాట్లాడే ఐదుగురు అధికారుల బృందాన్ని సిద్ధం చేశారు. అతడ్ని అరెస్ట్ చేయడం కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ నెల 21న అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫైనల్గా రజ్వీందర్ చేతికి చిక్కడంతో.. త్వరలోనే అతడిని క్వీన్స్లాండ్ పోలీసులకు అప్పగించనున్నారు.
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..