Site icon NTV Telugu

భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం.. మళ్లీ పొడిగించిన ఆ దేశం

travel ban

travel ban

కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోగా… కొత్త వేరియంట్లు.. డెల్టా, డెల్టా ప్లస్ కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించింది ఫీలిప్పైన్స్.. ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించగా.. ఇప్పటికే భారత్ నుంచి రాక‌పోక‌ల‌పై ఉన్న నిషేధాన్ని జులై 15వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఫీలిప్పైన్స్.. ఇక, పాకిస్థాన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, నేపాల్, ఒమ‌న్‌, యూఏఈ దేశాల‌పై కూడా ఈ నిషేధ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు ఆ దేశ ప్రెసిడెన్షియ‌ల్ స్పోక్స్‌ప‌ర్స‌న్‌ హ్యారీ రోక్యూ. క‌రోనా డెల్టా వేరియంట్ నేప‌థ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Exit mobile version