Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
- ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్..
- రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’..
- ఆరు నెలల్లో రెండు సార్లు సరెండర్ అయిన పాక్..
- సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘాన్ దాడులు తట్టుకోలేక, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను రెండు దేశాల మధ్య మిడియేషన్ చేయాలని, ఆఫ్ఘాన్ దాడులు ఆపేలా చేయాలని పాకిస్తాన్ కోరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Also: Maoist Surrender: మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..
Also Read
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు సమస్య శతాబ్ధానికి పైగా ఉంది. రెండు దేశాల మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ ఈ ఘర్షణలకు మూలంగా మారింది. పాకిస్తాన్ ఈ సమస్యను ‘‘సంక్లిష్టమైన కానీ పరిష్కరించగల సమస్య’’గా అభివర్ణించింది. దీనికి సానుకూల పరిష్కారం కనుగొనడానికి నిజాయితీగా ప్రయత్నించడానికి రెండు వైపుల అంగీకారం కుదిరింది అని చెప్పింది. దౌత్యపరమైన సంభాషణలు, శత్రుత్వాన్ని నిలిపేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు పాక్ చెప్పింది.
నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పోరాటాన్ని ఆపేయాలని, ‘‘అల్లాహ్ కే వాస్తే(దేవుడి కోరకు)’’ దాడుల్ని ఆపేయాలని తమను కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారి అబ్దుల్ హక్ హమద్ చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో పాకిస్తాన్ రెండోసారి సరెండర్ అయింది. అంతకుముందు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహిస్తే, నాలుగు రోజుల్లోనే పాక్ చేతులు ఎత్తేసి, శాంతి జెండాను ఎగురవేసింది.
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!