Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol and Diesel Prices Cut: పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి ఇంధన ధరల విషయంలో ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం, తాజాగా మరోసారి ధరల్లో కోత విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.22, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను కూడా లీటరుకు రూ.22 మేర తగ్గించారు. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.380గా, డీజిల్ ధర రూ.381గా నిర్ణయించారు. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇంధన ధరల తగ్గింపుకు ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో నమోదైన పతనాన్ని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం రోజుల్లో సుమారు 11 శాతం వరకు తగ్గాయి. అయితే హార్మూజ్ జలసంధి అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటు కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కిరోసిన్ ధర లీటరుకు రూ.313.44 నుంచి రూ.272కు తగ్గించబడింది. ఈ ధరలు పాకిస్థానీ రూపాయలలో నిర్ణయించబడ్డాయి.
Also Read
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఉపశమనం కంటే ముందు పాకిస్థాన్ ప్రజలు భారీ ధరల భారం ఎదుర్కొన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో మార్చి 6న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 వరకు పెంచింది. అనంతరం ఏప్రిల్ 2న కూడా పెట్రోల్ ధరను 43 శాతం, డీజిల్ ధరను 55 శాతం వరకు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల లేదా తగ్గుదల నేరుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పెట్రోల్ను ప్రధానంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు వంటి వాహనాల్లో ఉపయోగిస్తారు. మరోవైపు డీజిల్ ధరలు భారీ వాణిజ్య వాహనాలు, సరుకు రవాణా రంగం, పరిశ్రమల నిర్వహణ ఖర్చులను ప్రభావితం చేస్తాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ చమురు మార్కెట్లలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం వరుసగా రెండోసారి ధరలు తగ్గించింది. దీంతో అక్కడి ప్రజలకు కొంత ఊరట లభించినప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ పరిస్థితులను బట్టి ఇంధన ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?