Pakistan: ఫుట్ బాల్ స్టేడియం వెలుపల బాంబ్ బ్లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack outside a football stadium in Pak’s Balochistan: పాకిస్తాన్ లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఎయిర్ పోర్టు రోడ్డులోని టర్బట్ స్టేడియంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారితో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆ పేలుడు సంభవించింది. స్టేడియంలోని పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన ఓ మోటార్ సైకిల్ లో పేలుడు పదార్ధాలను అమర్చి.. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబును పేల్చేశారు. స్టేడియానికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో టర్బట్ జిల్లా క్రీడాధికారితో పాటు పోలీసులు మంజూర్ అహ్మద్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఫుట్ బాల్ మ్యాచును ఫ్రాంటియర్ కార్ప్స్ సౌత్ నిర్వహించింది. ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొన్న ఆలగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం
Also Read
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
కాగా.. బెలూచిస్తాన్ లో గత కొంత కాలంగా బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ వరసగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ నుంచి బెలుచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తోంది. ఇటీవల బెలూచ్ విముక్తికి భారత దేశం సహకరించాలని బెలూచ్ పోరాట యోధులు కోరారు. ఇదే కాకుండా ఇటీవల పాకిస్తాన్ – చైనా ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టుతో బెలూచిస్తాన్ లో భారీగా సైన్యం మోహరించింది. దీంతో పాటు చైనీయుల సంఖ్య అక్కడ ఎక్కువగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వరసగా చైనా జాతీయులు, పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పాక్ సైన్యం బెలూచ్ ప్రజలపై అకృత్యాలకు పాల్పడుతుందని బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ ఆరోపిస్తోంది. బెలూచిస్తాన్ లో ప్రజల హక్కులకు విలువ లేకుండా పోయింది. దీంతోనే వరసగా ఇటీవల కాలంలో కరాచీలో బాంబు దాడులకు పాల్పడింది. బెలూచిస్తాన్ లో సైన్యాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తోంది.
తాజావార్తలు
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!