భారతీయులకు గుడ్న్యూస్.. నిబంధనలు ఎత్తివేసిన ఆ దేశం
భారత్ నుంచి వెళ్లే వాళ్లపై అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని ఎత్తి వేసింది బ్రిటన్. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్కు డెల్టా వేరియంటే కారణమని భావిస్తోంది బ్రిటన్. ఈ క్రమంలో మన దేశం నుంచి వెళ్లే వాళ్ల ద్వారా తమ పౌరులు కరోనా సోకుతుందంటూ ఇటీవల లేనిపోని భయాలు వ్యక్తం చేసింది. బ్రిటన్లో అనుమతి పొందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాను మన దగ్గర కోవీషీల్డ్ పేరుతో ఇస్తున్నారు. కానీ… కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా సరే విమానం ఎక్కేముందు RT-PCR పరీక్ష చేయించుకోవాల్సిందే అంటోంది బ్రిటన్. అలాగే, భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వాళ్లకు పది రోజుల పాటు కఠిన క్వారంటైన్ అమలు చేయడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది.
బ్రిటన్ అనుసరిస్తున్న విధానంపై భారత్ సహా పలు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు జారీ చేసింది బ్రిటన్. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లిన వాళ్లకు విమానం ఎక్కేటప్పుడు RT-PCR టెస్టు అక్కర్లేదు. బ్రిటన్లో కాలుమోసిన రెండో రోజున కరోనా టెస్టు చేయించుకుంటే సరిపోతుంది. అయితే, కోవీషీల్డ్ వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. బ్రిటన్ ఇంత వరకూ ఫైజర్-బయో N-టెక్, మోడర్నా, యాన్సెస్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్లను మాత్రమే గుర్తించింది. ఇవి కాకుండా ఇతర కరోనా వ్యాక్సీన్లు తీసుకున్న వాళ్లకు బ్రిటన్ విమానం ఎక్కే ముందు RT-PCR పరీక్ష చేయించుకుని, నెగటీవ్ వచ్చినట్టు చూపించాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తి అధికంగా గల రెడ్ లిస్ట్ దేశాలకు ఇది వర్తిస్తుంది. అలాగే, రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చిన వాళ్లు బ్రిటన్కు చేరుకున్నాక తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. మన దేశంలో కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వాళ్ల సర్టిఫికెట్ను కరోనా పాస్పోర్టుగా బ్రిటన్ గుర్తించకపోవడం పట్ల ఇటీవల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పంతాలు నెలకొన్నాయి. బ్రిటన్ నుంచి వచ్చే వాళ్లపై భారత్ కూడా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో దిగివచ్చిన బ్రిటన్ భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల విషయంలో నిబంధనల్ని సడలించింది.
- Tags
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
-
Yash : గోవాలో తండ్రీకొడుకుల పగ: ‘టాక్సిక్’ కథ లీక్ చేసిన యశ్
-
Electric Scooters: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Air India Crisis: రూ.22 వేల కోట్ల నష్టంలో ఎయిర్ ఇండియా.. టాటా బాస్తో సింగపూర్ ఎయిర్లైన్స్ CEO రెస్క్యూ మీటింగ్!
ట్రెండింగ్
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!