ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్న సమయంలో.. భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది నెదర్లాండ్స్ ప్రభుత్వం.. భారత్తో పాటు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది.. నెదర్లాండ్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.. అయితే, కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉండడంతో..ప్రయాణానికి ముందు చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నెగటివ్ రిపోర్టు చూయించడం తప్పనిసరి అని షరతులు పెట్టింది.. అంతేకాదు.. ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత క్వారంటైన్ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.
భారత్ విమానాలపై నిషేధం ఎత్తివేసిన ఆ దేశం
flight