USA: న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..!

  • న్యూఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కారు..
  • అమెరికా న్యూ ఓర్లీన్స్‌లో ఘటన..
  • నిందితుడు కాల్పులు జరిపినట్లు నివేదికలు..
Usa

Usa

USA: అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్‌ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్‌ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుల సంఖ్యను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

Read Also: GST Collections: 2024లో జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

×
×
Ad

ఇటీవల జర్మనీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపైకి ఇలాగే కార్ దూసుకెళ్లింది. జర్మనీలోని మాగ్డెన్‌బర్గ్2లో ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు మరణించగా, 200 మందికి పైగా ప్రజలు గాయాలు పాలయ్యారు.సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.