Site icon NTV Telugu

Bangladesh: ముగిసిన యూనస్ శకం.. ప్రజల తీర్పు ఏం చెబుతోంది?

Muhammad Yunus

Muhammad Yunus

బంగ్లాదేశ్.. ఈ మధ్య అంతర్జాతీయంగా ఎక్కువగా వినిపించిన పేరు. దీనికి కారణం హింస, అల్లర్లతో దేశం అట్టుడికింది. 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. అడ్డుకునే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు రోడ్లపైకి రావడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయే వచ్చేశారు.

అనంతరం దేశంలో పరిస్థితులు చక్కదిద్దడానికి నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈయనైనా పరిస్థితులు చక్కదిద్దుతారనుకుంటే గతంలో కంటే దారుణంగా పరిస్థితులు మారాయి. భారత్‌పై అక్కసుతో హిందువులే టార్గెట్‌గా మారణహోమం జరిగింది. ఇటీవల కాలంలో పలువురు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. అంతేకాకుండా భారత్‌తో యూనస్ ఘర్షణ వాతావరణాన్నే కోరుకున్నారు. పరిస్థితుల్ని చక్కదిద్దాల్సింది పోయి ఆజ్యం పోయడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

మొత్తానికి తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశీయులు సుస్థిరమైన పాలనకు ఓటేశారు. తారిక్ రెహమాన్ నేతృత్వంలో బీఎన్‌పీకి భారీ విజయాన్ని అందించారు. 299 స్థానాలకు గాను 212 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికారు. యూనస్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పారు. దీంతో బంగ్లాదేశ్‌లో యూనస్ శకం ముగిసినట్లైంది.

Exit mobile version