Site icon NTV Telugu

Montenegro: కుటుంబ కలహాలతో కాల్పులు.. పిల్లలతో సహా 12 మంది మృతి

Mantenegro

Mantenegro

Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.

8 ఏళ్లు, 11 ఏళ్ల పిల్లలతో పాటు ఇద్దరు తోబుట్టువులను, వారి తల్లిని చంపాడు. సదరు కుటుంబం, ఘటనకు పాల్పడిన వ్యక్తి అంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. కాల్పులకు సరైన కారణాలు ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఈ దాడి జరిగిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన దుండగుడు మరో ఏడుగురిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు కాల్పుల్లో దుండగుడు మరణించాడు. కాల్పుల ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించే మార్గంలో మరణించారు.

Read Also: Pavan Tej: ఘనంగా హీరోయిన్ తో మెగా వారసుడి నిశ్చితార్థం

మెక్సికోలో గ్యాంగ్ వార్:

మెక్సికోలో మరోసారి గ్యాంగ్ వార్ జరిగింది. సియూడాడ్ వారెజ్ లో ఓ దుకాణం వెలుపల వార్తల్ని కవర్ చేస్తున్న రేడియో ఉద్యోగులను నలుగురిని హతమర్చారు మెక్సికన్ గ్యాంగ్. ఈ ఘటనలో నలుగురు రేడియో ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికన్ గ్యాంగ్స అంతకుముందు గురువారం రోజున మెక్సికో సరిహద్దులోని ఓ జైలుపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఖైదీలు మరనణించడంతో పాటు మరో 20 మంది ఖైదీలు గాయపడ్డారు. మొత్తం మెక్సికోలో ఈ గ్యాంగ్ వార్ల కారణంగా రెండు రోజుల్లో 11 మంది మరణించారు. అయితే ఎలాంటి గ్యాంగ్స్ లో సభ్యులుగా లేని అనేెక మంది సాధారణ, అమాయక పౌరులను కాల్చిచంపడంపై మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడార్ విచారం వ్యక్తం చేశారు.

Exit mobile version