Sri Lanka election: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే.. ఎన్నికల్లో ఘన విజయం..
- శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే.. తాజా ఎన్నికల్లో ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka election: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే(55) విజయం సాధించారు. ఆయన శ్రీలంక అధ్యక్ష పదవిని అధిరోహించబోతున్నారు. మార్స్కిస్ట్ నేతగా, జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపొందారు. 2022 ఆర్థిక మాంద్యం తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలు ఇవే. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అభ్యర్థి విజయం మొదటి రౌండ్లో తేలకుండా రెండో రౌండ్కి చేరుకోవడం ఇదే తొలిసారి. మొదటి రౌండ్లో ఏ అభ్యర్థికి 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సి వచ్చింది.
Read Also: Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు శనివారం ఓటింగ్ జరిగింది. వెంటనే కౌంటింగ్ మొదలైంది. ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు. 20 ఏళ్లుగా పార్లమెంట్లో ఉన్న దిసానాయకేపై శ్రీలంక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంకలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు.
శనివారం జరిగిన ఎన్నికల్లో 55 ఏళ్ల దిసానాయకే 42.31% ఓట్లను సాధించారని, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని శ్రీలంక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శ్రీలంకలోని 17 మిలియన్ల అర్హత కలిగిన ఓటర్లలో 75% మంది పాల్గొన్నారు.శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసానాయకే తన విజయం తర్వాత జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. సింహళీయులు, తమిళులు, ముస్లింలు మరియు శ్రీలంక ప్రజలందరి ఐక్యత ఇది కొత్త ప్రారంభమని అన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!