Sri Lanka election: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే.. ఎన్నికల్లో ఘన విజయం..
- శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే.. తాజా ఎన్నికల్లో ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka election: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే(55) విజయం సాధించారు. ఆయన శ్రీలంక అధ్యక్ష పదవిని అధిరోహించబోతున్నారు. మార్స్కిస్ట్ నేతగా, జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపొందారు. 2022 ఆర్థిక మాంద్యం తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలు ఇవే. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అభ్యర్థి విజయం మొదటి రౌండ్లో తేలకుండా రెండో రౌండ్కి చేరుకోవడం ఇదే తొలిసారి. మొదటి రౌండ్లో ఏ అభ్యర్థికి 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సి వచ్చింది.
Read Also: Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు శనివారం ఓటింగ్ జరిగింది. వెంటనే కౌంటింగ్ మొదలైంది. ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు. 20 ఏళ్లుగా పార్లమెంట్లో ఉన్న దిసానాయకేపై శ్రీలంక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంకలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు.
శనివారం జరిగిన ఎన్నికల్లో 55 ఏళ్ల దిసానాయకే 42.31% ఓట్లను సాధించారని, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని శ్రీలంక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శ్రీలంకలోని 17 మిలియన్ల అర్హత కలిగిన ఓటర్లలో 75% మంది పాల్గొన్నారు.శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసానాయకే తన విజయం తర్వాత జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. సింహళీయులు, తమిళులు, ముస్లింలు మరియు శ్రీలంక ప్రజలందరి ఐక్యత ఇది కొత్త ప్రారంభమని అన్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..