King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి మూడు కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్దం అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, రాజకుటుంబీకుల మధ్య ఈ రోజు ఆయన పట్టాభిషేకం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్ ఖడ్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3, ఆయన భార్య రాణి కెమిల్లా ధరించే కిరీటాలపై అందరి ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కిరీటాలు ఉపయోగించనున్నారు. ఇందులో రెండు రాజుకు సంబంధించినవి కాగా.. ఒక దానిని రాణి ధరిస్తారు.
సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్:
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
రాజు ధరించే కిరీటాల్లో సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటం మొదటిది. దీన్ని పట్టాభిషేకం సమయంలో కాంటర్బరీ ఆర్చ్ బిషప్ రాజు తలపై ఉంచుతారు. 1649లో కరిగిపోయిన మధ్యయుగ కిరీటానికి బదులుగా 1661లో కింగ్ చార్లెస్ II కోసం ఈ కిరీటం తయారు చేయబడింది. దీన్ని చివరిసారిగా ఛార్లెస్-3 తల్లి చనిపోయిన క్వీన్ ఎలిజబెత్-2 సమయంలో ఆమె పట్టాభిషేకం సమయంలో ఉపయోగించారు. 2.2 కిలోల బరువు ఉన్న ఈ కిరీటం కెంపులు, నీలమణి, గోమేదికం, పుష్యరాగం, అమెథిస్ట్, టూర్మాలిన్ లాంటి విలువైన రాళ్లను బంగారు కిరీటంలో అమర్చారు.
ఇంపీరియల్ స్టేట్ క్రౌన్:
పట్టాభిషేకం వేడులక ముగింపు సమయంలో కింగ్ ఛార్లెస్ సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని తీసేసి ఇంపీరియల్ స్టేట్ కిరీటాన్ని ధరిస్తారు. ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ అనేది పార్లమెంట్ స్టేట్ ఓపెనింగ్ వంటి వేడుకల సందర్భాలలో కూడా ఉపయోగించబడుతుంది. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన క్వీన్ ఎలిజబెత్ II ప్రభుత్వ అంత్యక్రియల్లో చివరిసారిగా వాడారు.
1.06 కిలోల బరువు ఉండే ఈ కిరీటం ఎత్తు 31.5 సెంటీమీటర్లు. దీనిలో 2,868 వజ్రాలు, 17 నీలమణి, 11 పచ్చలు, 269 ముత్యాలు, నాలుగు కెంపులు అమర్చబడ్డాయి. ఈ కిరీటంలో కల్లినన్ 2 వజ్రం ఉంది. ఇది కల్లినన్ వజ్రం నుంచి కత్తిరించిన రెండో అతిపెద్ద రాయి, ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద వజ్రమని రాయల్ కలెక్షన్ ట్రస్ట్ చెబుతోంది.
క్వీన్ మేరీస్ క్రౌన్:

ఈ కిరీటాన్న పట్టాభిషేకం సమయంలో క్వీన్ కోసం ఉపయోగిస్తారు. ఆధునిక కాలంలో క్వీన్ పట్టాభిషేకం కోసం తొలిసారిగా దీన్ని ఉపయోగించనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 ఆభరణాల్లోని కుల్లినన్ 3, 4, 5 వజ్రాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ కిరీటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన 105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం ఉండదు. ఒకవేళ దీన్ని ఉపయోగించనట్లయితే భారత్ నుంచి దౌత్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే భారత్ దాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని బీబీసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?