భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి రష్యాలో పర్యటిస్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ సమావేశం అయ్యారు. భారత బృందాన్ని పుతిన్ ఆప్యాయంగా పలకరించారు. సుంకాల విషయంలో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. వచ్చే నెలలో భారత్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ ఆహ్వానం మేరకు జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. మాస్కోతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భౌగోళిక రాజకీయ అంశాలపై జైశంకర్ చర్చించనున్నారు. ఇక పుతిన్ భారత్కు వచ్చే ముందు జైశంకర్ రష్యాలో పర్యటించడం రెండు దేశాల సంబంధాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో ఇంధన, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడనున్నాయి.

