Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- అసిమ్ మునీర్ ట్రంప్ భజనపరుడు
- అమెరికాకు తొత్తుగా వ్యహరిస్తున్నారు
- ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనంతరం మరోసారి చర్చల కోసం ఇరాన్ను ఒప్పించేందుకు నేరుగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్కు వెళ్లారు. ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం మునీర్కు ముసాయిదా ప్రతిపాదనను అందించారు. దాన్ని అమెరికాకు అందించాలని సూచించారు. కానీ ముసాయిదాను అందించడంలో అసిమ్ మునీర్ విఫలమైనట్లుగా ఇరాన్ మీడియా ఆరోపించింది. అసిమ్ మునీర్ పూర్తిగా అమెరికాకు భజనపరుడిలా మారిపోయారని ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
Also Read
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
అమెరికాతో జరుగుతున్న చర్చల్లో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. రెండు దేశాల మధ్య తటస్థంగా ఉండాల్సిన పాకిస్థాన్.. అమెరికాకు తొత్తుగా మారిందని మండిపడింది. అసిమ్ మునీర్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రతిపాదనను అమెరికాకు తెలియజేసే బాధ్యతను మునీర్ తీసుకున్నారని.. కానీ ఇప్పటివరకు వాషింగ్టన్ నుంచి స్పష్టమైన, కచ్చితమైన సమాధానం రాలేదని టెహ్రాన్ పేర్కొంది. మొత్తం మధ్యవర్తిత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని.. తద్వారా ఇరాన్ను దౌత్యపరంగా ఏకాకిని చేయవచ్చని ఇరాన్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
ఇరాన్ టీవీ కథనం ప్రకారం… అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ ముసాయిదా ప్రతిపాదనను అందుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా పక్షానికి సరిగ్గా సమర్పించడంలో గానీ.. అమెరికా స్పందనను స్పష్టం చేయడంలో గానీ విఫలమయ్యారని ఆరోపించింది. మునీర్ వ్యక్తిగతంగా ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి కూడా.. బహిరంగంగా, దౌత్యపరంగా అమెరికా ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. మధ్యవర్తి సరిగ్గా నిలబడకపోతే.. మొత్తం ప్రక్రియ విఫలమవుతుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. ఆశ్చర్యంగా ఇరాన్ అడగకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ నిరవధికంగా పెంచారు. హార్ముజ్ జలసంధిపై మాత్రం దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు పొడిగించినందుకు ట్రంప్నకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..