Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- అసిమ్ మునీర్ ట్రంప్ భజనపరుడు
- అమెరికాకు తొత్తుగా వ్యహరిస్తున్నారు
- ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనంతరం మరోసారి చర్చల కోసం ఇరాన్ను ఒప్పించేందుకు నేరుగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్కు వెళ్లారు. ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం మునీర్కు ముసాయిదా ప్రతిపాదనను అందించారు. దాన్ని అమెరికాకు అందించాలని సూచించారు. కానీ ముసాయిదాను అందించడంలో అసిమ్ మునీర్ విఫలమైనట్లుగా ఇరాన్ మీడియా ఆరోపించింది. అసిమ్ మునీర్ పూర్తిగా అమెరికాకు భజనపరుడిలా మారిపోయారని ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
అమెరికాతో జరుగుతున్న చర్చల్లో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. రెండు దేశాల మధ్య తటస్థంగా ఉండాల్సిన పాకిస్థాన్.. అమెరికాకు తొత్తుగా మారిందని మండిపడింది. అసిమ్ మునీర్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రతిపాదనను అమెరికాకు తెలియజేసే బాధ్యతను మునీర్ తీసుకున్నారని.. కానీ ఇప్పటివరకు వాషింగ్టన్ నుంచి స్పష్టమైన, కచ్చితమైన సమాధానం రాలేదని టెహ్రాన్ పేర్కొంది. మొత్తం మధ్యవర్తిత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని.. తద్వారా ఇరాన్ను దౌత్యపరంగా ఏకాకిని చేయవచ్చని ఇరాన్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
ఇరాన్ టీవీ కథనం ప్రకారం… అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ ముసాయిదా ప్రతిపాదనను అందుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా పక్షానికి సరిగ్గా సమర్పించడంలో గానీ.. అమెరికా స్పందనను స్పష్టం చేయడంలో గానీ విఫలమయ్యారని ఆరోపించింది. మునీర్ వ్యక్తిగతంగా ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి కూడా.. బహిరంగంగా, దౌత్యపరంగా అమెరికా ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. మధ్యవర్తి సరిగ్గా నిలబడకపోతే.. మొత్తం ప్రక్రియ విఫలమవుతుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. ఆశ్చర్యంగా ఇరాన్ అడగకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ నిరవధికంగా పెంచారు. హార్ముజ్ జలసంధిపై మాత్రం దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు పొడిగించినందుకు ట్రంప్నకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!