Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- అసిమ్ మునీర్ ట్రంప్ భజనపరుడు
- అమెరికాకు తొత్తుగా వ్యహరిస్తున్నారు
- ఓ రేంజ్లో ఆడుకున్న ఇరాన్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనంతరం మరోసారి చర్చల కోసం ఇరాన్ను ఒప్పించేందుకు నేరుగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్కు వెళ్లారు. ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం మునీర్కు ముసాయిదా ప్రతిపాదనను అందించారు. దాన్ని అమెరికాకు అందించాలని సూచించారు. కానీ ముసాయిదాను అందించడంలో అసిమ్ మునీర్ విఫలమైనట్లుగా ఇరాన్ మీడియా ఆరోపించింది. అసిమ్ మునీర్ పూర్తిగా అమెరికాకు భజనపరుడిలా మారిపోయారని ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
అమెరికాతో జరుగుతున్న చర్చల్లో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. రెండు దేశాల మధ్య తటస్థంగా ఉండాల్సిన పాకిస్థాన్.. అమెరికాకు తొత్తుగా మారిందని మండిపడింది. అసిమ్ మునీర్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రతిపాదనను అమెరికాకు తెలియజేసే బాధ్యతను మునీర్ తీసుకున్నారని.. కానీ ఇప్పటివరకు వాషింగ్టన్ నుంచి స్పష్టమైన, కచ్చితమైన సమాధానం రాలేదని టెహ్రాన్ పేర్కొంది. మొత్తం మధ్యవర్తిత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని.. తద్వారా ఇరాన్ను దౌత్యపరంగా ఏకాకిని చేయవచ్చని ఇరాన్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
ఇరాన్ టీవీ కథనం ప్రకారం… అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ ముసాయిదా ప్రతిపాదనను అందుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా పక్షానికి సరిగ్గా సమర్పించడంలో గానీ.. అమెరికా స్పందనను స్పష్టం చేయడంలో గానీ విఫలమయ్యారని ఆరోపించింది. మునీర్ వ్యక్తిగతంగా ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి కూడా.. బహిరంగంగా, దౌత్యపరంగా అమెరికా ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. మధ్యవర్తి సరిగ్గా నిలబడకపోతే.. మొత్తం ప్రక్రియ విఫలమవుతుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. ఆశ్చర్యంగా ఇరాన్ అడగకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ నిరవధికంగా పెంచారు. హార్ముజ్ జలసంధిపై మాత్రం దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు పొడిగించినందుకు ట్రంప్నకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!