Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
- హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత
- నౌకపై ఇరాన్ దాడులు
- ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొడిగించారు. కానీ హార్ముజ్పై దిగ్బంధం ఎత్తేయలేదు. దీంతో రెండు దేశాల మధ్య అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే హార్ముజ్లోని ఒక నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని యూకే తెలిపింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
Also Read
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన వారిపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ వాన్గార్డ్ టెక్ ప్రకారం.. దాడి జరిగిన నౌక లైబీరియా జెండాను ఎగురవేస్తోంది. అయితే హార్ముజ్లో ప్రయాణించడానికి అనుమతి ఉందని తెలిపింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ మాత్రం.. ఆ నౌక ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను విస్మరించిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Karnataka: దారుణం.. హోమ్స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
ఇరాన్తో ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తుంది. అయితే గడువు ముగిసేలోపు శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పదే పదే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంది. బెదిరిస్తే చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. కానీ విచిత్రంగా 24 గంటల ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అడగకుండానే పొడిగించడమేంటి? అని ప్రపంచ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజావార్తలు
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!