Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ
- నలుగురు మృతి.. పలువురికి గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు చనిపోగా.. పదుల కొద్ది గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సహాయ బృందం సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బెకాసి తిమూర్ రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అదే ట్రాక్పైకి మరొక రైలు వచ్చేసింది. దీంతో బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొందరు భయంతో కేకలు వేస్తూ కిందకు దూకేశారు. వెనుక నుంచి బలంగా రైలు ఢీకొట్టడంతో చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నలుగురు మృతదేహాలను బయటకు తీయగా.. డజన్ల కొద్దీ గాయపడడంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, సరైన నిర్వాహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇండోనేషియాలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2024 జనవరిలో వెస్ట్ జావాలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది మృతి చెందగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. అలాగే 2015లో జకార్తాలో రైలు-మినీబస్ ఢీకొన్న ఘటనలో 16 మంది మరణించారు.
इंडोनेशिया में भीषण ट्रेन हादसा
इंडोनेशिया की राजधानी जकार्ता में देर रात एक बड़ा रेल हादसा हुआ, जिसमें एक ट्रेन दूसरी ट्रेन से टकरा गई. इस भीषण दुर्घटना में कम से कम 7 लोगों की मौत हो गई, जबकि कई यात्री गंभीर रूप से घायल हो गए. लोगों को बचाने के लिए राहत एवं बचाव कार्य जारी… pic.twitter.com/TEROl7Ffy2
— NDTV India (@ndtvindia) April 28, 2026
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!