Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఒక భారతీయ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో భారత్కు చెందిన ‘హాజీ అలీ’ అనే నౌకపై డ్రోన్ దాడి చోటుచేసుకుంది. ఈ డ్రోన్ దాడిలో ఆ నౌక తీవ్రంగా దెబ్బతిని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియలేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పలు నివేదికల ప్రకారం.. ఆ నౌకలో 14 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 14 మందిని రక్షించినట్లు ఒమన్ నావికాదళం ప్రకటించింది.
‘హాజీ అలీ’ (MSV HAJI ALI BDI 1492) అనే సరుకు రవాణా గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాకు చెందింది. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌక మునిగిపోవడం ఇది రెండవ సారి. అంతర్జాతీయ జలాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, గుజరాత్ నౌకా రవాణా పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేవలం వారం క్రితమే, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ – అమెరికా మధ్య జరిగిన కాల్పుల్లో గుజరాత్ నౌక ‘అల్ ఫైజ్ నూర్ సోలేమానీ-1’ మునిగిపోయింది.
Also Read
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
‘హాజీ అలీ’ విషయానికి వస్తే.. మే 13న తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు, ఆ నౌక సోమాలియాలోని బెర్బెరా నుంచి షార్జాకు ప్రయాణిస్తోంది. అది ఒమన్లోని లిమా సమీపంలో వెళుతుండగా, ఒక డ్రోన్ శక్తివంతమైన పేలుడు పదార్థాలతో ఈ నౌకను పేల్చివేసింది. ఈ ప్రమాదంతో నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో ఓడ మునిగిపోవడం స్టార్ట్ అయ్యింది. ఓడ మునిగిపోవడాన్ని చూసిన 14 మంది సిబ్బంది, వెంటనే లైఫ్బోట్ల ద్వారా వారి ప్రాణాలను కాపాడుకున్నారు. వెంటనే ఒమన్ కోస్ట్ గార్డ్ స్పందించి భారతీయ నావికులందరినీ రక్షించింది. అనంతరం వారిని ఒమన్లోని దిబా పోర్టుకు తరలించారు. ‘హాజీ అలీ’ ఓడ యజమాని సుల్తాన్ అహ్మద్ సంఘర్, 14 మంది సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. ఇప్పుడు ఒమన్ పోలీసులు ఈ నౌకపై ఎవరు దాడి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో రక్షించిన నావికులను తిరిగి భారత్కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై నిన్న జరిగిన దాడి ఆమోదయోగ్యం కాదని, వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం భారత సిబ్బంది క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత సిబ్బందిని రక్షించినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
Our statement on the attack on an Indian-flagged ship off the coast of Oman ⬇️
🔗 https://t.co/whly2BJ4TJ pic.twitter.com/PF0wAQ14zY
— Randhir Jaiswal (@MEAIndia) May 14, 2026
తాజావార్తలు
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
-
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
-
Storm Hit UP: ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?