NTV Telugu Site icon

India issues advisory: ఇజ్రాయిల్‌లోని భారత పౌరులకు కీలక సూచనలు..

Isreal

Isreal

India issues advisory: ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. అంతకుముందు ఈరోజు హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఈ నేపధ్యంతో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది.

Read Also: Israel: “ఆపరేషన్ ఐరన్ స్వార్డ్” ప్రారంభం..మేం యుద్ధంలో ఉన్నామన్న ఇజ్రాయిల్..

యుద్ధస్థితి ప్రకటించబడినందున శనివారం భారతీయ పౌరులకు కొన్ని సూచనల్ని జారీ చేసింది. భారతీయులు అప్రమతంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్ పాటించాలని అధికారులు కోెరారు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని, భద్రత ఉండే ప్రాంతాలకు దగ్గర ఉండాలని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్ హోం ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్ సందర్శించాలని, అత్యవసర పరిస్థితుల్లో వారి హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఇమెయిల్‌ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు పౌరులను కోరారు.