Site icon NTV Telugu

పాఠశాలలో కాల్పుల బీభత్సం.. ముగ్గురు విద్యార్థులు మృతి

అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. డెట్రాయిట్ నగరానికి సమీపంలోని ఓ పాఠశాలలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనలో ఓ టీచర్ సహా మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Read Also: ఇండో-పాక్‌ సరిహద్దుకు అమిత్‌షా

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. అనంతరం 15 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఓ తుపాకీని, 15-20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పాఠశాలలలో కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version