Site icon NTV Telugu

తాలిబ‌న్ల చేతిలోకి ఆఫ్ఘన్‌…! డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump

Donald Trump

తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతూనే ఉన్నారు.. ఓవైపు అరచకాలు సృష్టిస్తూ తాలిబన్లు దూసుకెళ్తుండగా.. వారిని నిలువరించలేక.. సైన్యం సైతం చేతులు ఎత్తేసింది.. చివరకు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోకి కూడా ఎంట్రీ అయిపోయారు తానిబన్లు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత యూఎస్‌ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు.. ఆఫ్ఘన్‌లో తాలిబ‌న్ల రాజ్యానికి తెర‌దించి, ఆ దేశాన్ని పున‌ర్నిర్మించ‌డానికి ఈ రెండు ద‌శాబ్దాల‌లో 2 ల‌క్షల కోట్ల డాల‌ర్లును అమెరికా ఖర్చు చేసిందని.. 2500 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారని ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ట్రంప్.. చివ‌రికి ఇంతా చేసి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఆఫ్ఘనిస్థాన్‌లో మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, ఈ పాపం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌దే నని మండిపడ్డ ఆయన.. ఇప్పటికైనా న‌న్ను మిస్ అవుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.

Exit mobile version