Site icon NTV Telugu

కాశ్మీర్, నోయిడా, ఉత్తర కాశీలో భూప్రకంపనలు

భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్​ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.

https://ntvtelugu.com/five-lakh-indains-lost-life-to-coronavirus-in-india-till-date/

ఇటు ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. మనదేశంతో పాటు అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్​లోని కశ్మీర్​, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మాలజీ వెల్లడించింది. అటు పాక్​లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్​ ఇస్లామాబాద్​లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

Exit mobile version