Scientists disappear: అగ్రదేశాలు అమెరికా, చైనాలో వరసగా కీలకమైన సైంటిస్టులు మాయమవుతున్నారు. వరసగా జరుగుతున్న ఈ ఘటనలు ఆయా దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. అణు సాంకేతికత, ఏఐ, హైపర్సోనిక్ ఆయుధాలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాలకు చెందినవారు హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో ఇలాంటివి 11 సంఘటనలు నమోదయ్యాయి. చైనాలో 9 మంది సైంటిస్టులు మరణించారు. అయితే, ఈ సంఘటనలు చాలా వరకు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనక ఏదైనా కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
ఇటీవల అమెరికాలో నాసా ఇంజనీర్లు, ఎయిర్ఫోర్స్ జనరల్స్, లాస్ అలమోస్ వంటి అణు ప్రయోగశాల్లోని శాస్త్రవేత్తలు ఇలాంటి పరిస్థితులకే బలయ్యారు. మేజర్ జనరల్ విలియం నీల్ మెక్కాస్లాండ్ మిస్ అయ్యాడు. ఎయిర్ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ కమాండర్గా పనిచేసే ఈయన, 2026 ఫిబ్రవరిలో వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. ఫోన్, కళ్లద్దాలు, స్మార్ట్ వాచ్ ఇంట్లో వదిలేసిన ఆయన, కేవలం ఒక రివాల్వర్ మాత్రమే తన వెంటన తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమయ్యారనే విషయం తెలియలేదు.
ఇదే విధంగా నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన మోనికా రెజా కూడా అదృశ్యమైంది. కాలిఫోర్నియాలో స్నేహితులతో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె మిస్ అయ్యారు. స్నేహితుల కన్నా కాస్త దూరం వెనకబడిన ఆమె ఆచూకీ ఇంత వరకు లభించలేదు. సహాయక బృందాలు రోజులు తరబడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా ఆమె జాడ కానరాలేదు. ఆమె రాకెట్లలో ఉపయోగించే సూపర్ అల్లాయ్లపై పరిశోధనలు చేస్తున్నారు.
