Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunami in Indonesia: డిసెంబరు 26, 2004 రాత్రి, 9.1-9.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద సునామీలలో ఒకటి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ అలలు ఎగిసిపడడంతో ఇండోనేషియాలో తెల్లవారుజామున పుట్టిన ఆవిపత్తు ఆ దేశంతో పాటు మరికొన్ని దేశాల ప్రజలను చీకట్లోకి నెట్టేసింది. అప్పట్లో సమర్థమంతమైన వార్నింగ్ సిస్టమ్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అదే బాక్సింగ్ డే సునామీ/ఇండియన్ ఓపెన్ సునామీ. నేటితో ఈ విషాదానికి 18 ఏళ్లు. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన సునామీ లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విపత్తు 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,000 మందికిపైగా చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇండోనేషియాలోని సుమిత్రకు పశ్చిమ తీరాన 250 కిలోమీటర్ల దూరంలో 30 మీటర్ల లోతులో పుట్టిన భూకంపం ఫలితమే ఈ విధ్వంసం.

Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ఇండియా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలతో ఈ భూకంపం పుట్టింది. అప్పుడు పుట్టిన ఎనర్జీ హిరోషిమాపై అమెరికా వేసిన ఆటమ్ బాంబ్ కంటే 23వేల రెట్లు ఎక్కువట. 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడిన ఈ అలలు గంటల వ్యవధిలో తూర్పు ఆఫ్రికా తీరం వరకు చేరుకున్నాయి. ఆ అలలు 8.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయట. రిక్టర్ స్కేలుపై 9.1-9.3గా నమోదైన ఆ భూకంపం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ ఇదే అత్యంత ప్రమాదకరమైన సునామీ. అత్యధికంగా ఇండోనేషియాలో దాదాపు 2,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా.. శ్రీలంకలో 35,322, మన దేశంలో 16,269, థాయ్లాండ్లో 8212 మంది ఈ సునామీకి బలయ్యారు. సోమాలియా, మాల్దీవ్స్, మలేషియా, మయన్మార్, టాంజానియా, బంగ్లాదేశ్, సీషెల్స్, సౌతాఫ్రికా, యెమెన్, కెన్యా దేశాల్లో కూడా ప్రాణనష్టం నమోదైంది. రూ.82.5 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2004లో ఆ విపత్తును కళ్లారా చూసిన వాళ్లకు ప్రశాంతంగా ఆహ్లాదాన్ని పంచే సముద్రాన్ని చూస్తుంటే ఇప్పటికీ ఆ విషాద ఛాయలు వెంటాడుతున్నాయి.

1880లలో భారతదేశాన్ని తాకిన చివరి పెద్ద సునామీ గురించి పెద్దగా తెలియదు. 1945లో పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ కూడా పేలవంగా నమోదు చేయబడిందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్ నాయక్ తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, భారతదేశంలో 10,136 మంది మరణించారు, అత్యధిక మరణాలు తమిళనాడు నుండి నమోదయ్యాయి. అయితే, అనధికారిక అంచనాల ప్రకారం వాస్తవ సంఖ్య 18,000 మందికి పైగా ఉండవచ్చన్నారు. భారతదేశంలో రెండవ అత్యంత ప్రభావిత ప్రాంతం అండమాన్, నికోబార్ దీవులు, అధికారిక మరణాల సంఖ్య 1,300కి చేరుకుంది, 5,500 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దాని వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. దేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, అండమాద్ దీవులలోని బారెన్ 1, భూకంప కార్యకలాపాల ఫలితంగా డిసెంబర్ 30న విస్ఫోటనం చెందింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!