Thailand: థాయ్లాండ్లో ఘోర విషాదం.. ట్రైన్పై క్రేన్ పడి 22 మంది మృతి
- థాయ్లాండ్లో ఘోర విషాదం
- ట్రైన్పై క్రేన్ పడి 22 మంది మృతి
- హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్యాసింజర్ రైలుపై ఒక్కసారిగా భారీ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో 22 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
బ్యాంకాక్కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్కు వెళ్తున్న రైలుపై క్రేన్ కూలిపోయింది. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. 30 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు జరుగుతుండగా క్రేన్ కూలిపోయింది.

రైల్లో మొత్తం 195 మంది ప్రయాణికులు ఉన్నారని రవాణా మంత్రి పిఫాట్ రచ్చకిత్ప్రకాన్ తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. రైలు లోపల చిక్కుకున్న ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!