భారతదేశంలో ఎండలు మండిపోతుంటే.. చైనాలో మాత్రం వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కారణంగా చైనాలో వరదలు ముంచెత్తాయి. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లోని క్విన్జౌలో ఎనిమిది గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రోడ్లు, వాహనాలు జలమయమయ్యాయి.
సోమవారం కేవలం ఎనిమిది గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని… అందులో ఒకే గంటలో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని చెప్పారు. రహదారులన్నీ జలమయం కావడంతో పాఠశాలలు, కాలేజీలు మూసేశారు. ఇక సహాయ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.
తీవ్రమైన వేడి కారణంగా వాతావరణంలో తేమ ఏర్పడడంతో భారీ వర్షపాతానికి ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు. తేమ అకస్మాత్తుగా వర్షం రూపంలోకి మారడంతోనే ఇలా సంభవించిందని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కడం కూడా దక్షిణ చైనాలో తేమను వర్షపాతంగా మార్చినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భారతదేశంలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక మధ్యాహ్నం అయితే భానుడు భగభగ మండిపతున్నాడు. ఉక్కపోత, చెమటతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ పొరుగున ఉన్న దేశంలో మాత్రం వరదలు బెంబేలెత్తిస్తున్నాయి.
Qinzhou, Guangxi, China is experiencing extreme rainfall that has caused flooding today.
273 mm in 8 hours, three times the extreme storm threshold.
160 mm in 1 hour, nearing world-record intensity.
Previous April records for the region have been broken. pic.twitter.com/7lel2xRWSE— Weather Monitor (@WeatherMonitors) April 27, 2026
