Chikoti Praveen: మళ్లీ దొరికిన చికోటి ప్రవీణ్.. ఈసారి థాయిల్యాండ్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఇసారి థాయ్ లాండ్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూదం ఆడుతున్నందుకు అరెస్టయ్యాడు. చీకోటితో పాటు హైదరాబాద్లో నమోదైన ఈడీ కేసులో ఏ1గా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన గేమింగ్ చిప్లను స్వాధీనం చేసుకున్నారు. జూదంలో కీలక పాత్ర పోషించిన మహిళ సితార్నన్ కెల్వెల్కర్ను థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read also: Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
Also Read
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
గ్యాబ్లింగ్ కోసం ఒక్కో భారతీయుడి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. మొత్తం రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 93 మందిలో నలుగురు మయన్మార్ జాతీయులు కాగా, ఆరుగురు థాయ్ దేశస్థులు. థాయ్ పోలీసులను చూసి జూదరులు పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను థాయ్లాండ్లోని పట్టాయాలో అదుపులోకి తీసుకున్నారు. చికోటి ప్రవీణ్ ఏప్రిల్ 27 నుంచి ఓ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ అద్దెకు తీసుకున్నాడు. ఖరీదైన హోటల్ లో గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేసిన చికోటీ.. థాయ్ లాండ్ మహిళలతో కలిసి హోటల్ లో క్యాసినో ఏర్పాటు చేసి.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జూదం నిర్వహిస్తున్నాడు. చీకోటి ప్రవీణ్ కొంతమంది భారతీయులను కూడా జూదం కోసం అక్కడికి తీసుకెళ్లాడు. థాయిలాండ్లో జూదం నిషేధించబడింది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పట్టాయాలోని ఒక విలాసవంతమైన హోటల్పై దాడి చేసి 80 మంది భారతీయ జూదగాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ ప్రూలోని సోయి ఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పట్టాయా హోటల్ వద్ద అర్ధరాత్రి దాడి జరిగింది. ఏప్రిల్ 27-మే 1వ తేదీ వరకు పలువురు భారతీయులు హోటల్లో గదులు బుక్ చేసుకున్నారని.. గ్యాంబ్లింగ్ కోసం సంపావో అనే కాన్ఫరెన్స్ రూమ్ను అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్ల నుంచి అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 100 కోట్లు జూదం ఆడుతూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!