Chikoti Praveen: మళ్లీ దొరికిన చికోటి ప్రవీణ్.. ఈసారి థాయిల్యాండ్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఇసారి థాయ్ లాండ్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూదం ఆడుతున్నందుకు అరెస్టయ్యాడు. చీకోటితో పాటు హైదరాబాద్లో నమోదైన ఈడీ కేసులో ఏ1గా ఉన్న మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన గేమింగ్ చిప్లను స్వాధీనం చేసుకున్నారు. జూదంలో కీలక పాత్ర పోషించిన మహిళ సితార్నన్ కెల్వెల్కర్ను థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read also: Supreme Court: ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోవచ్చు.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
Also Read
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
గ్యాబ్లింగ్ కోసం ఒక్కో భారతీయుడి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. మొత్తం రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. 93 మందిలో నలుగురు మయన్మార్ జాతీయులు కాగా, ఆరుగురు థాయ్ దేశస్థులు. థాయ్ పోలీసులను చూసి జూదరులు పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను థాయ్లాండ్లోని పట్టాయాలో అదుపులోకి తీసుకున్నారు. చికోటి ప్రవీణ్ ఏప్రిల్ 27 నుంచి ఓ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ అద్దెకు తీసుకున్నాడు. ఖరీదైన హోటల్ లో గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేసిన చికోటీ.. థాయ్ లాండ్ మహిళలతో కలిసి హోటల్ లో క్యాసినో ఏర్పాటు చేసి.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జూదం నిర్వహిస్తున్నాడు. చీకోటి ప్రవీణ్ కొంతమంది భారతీయులను కూడా జూదం కోసం అక్కడికి తీసుకెళ్లాడు. థాయిలాండ్లో జూదం నిషేధించబడింది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పట్టాయాలోని ఒక విలాసవంతమైన హోటల్పై దాడి చేసి 80 మంది భారతీయ జూదగాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ ప్రూలోని సోయి ఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పట్టాయా హోటల్ వద్ద అర్ధరాత్రి దాడి జరిగింది. ఏప్రిల్ 27-మే 1వ తేదీ వరకు పలువురు భారతీయులు హోటల్లో గదులు బుక్ చేసుకున్నారని.. గ్యాంబ్లింగ్ కోసం సంపావో అనే కాన్ఫరెన్స్ రూమ్ను అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్ల నుంచి అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 100 కోట్లు జూదం ఆడుతూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!