Yemen: యెమెన్ తీరంలో మునిగిన పడవ.. 68 మంది శరణార్థులు మృతి..
- యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునక.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు.. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 154 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yemen: యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ చెప్పారు. వీరిలో తొమ్మిది మంది ఇథియోపియన్ జాతీయులు కాగా, ఒకరు యెమెన్కి చెందిన వారు ఉన్నారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు.
Read Also: Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్గన్లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..
Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
154 మంది ఇథియోపియన్ వలసదారులతో కూడిన ఓడ ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్లోని అడెన్ గల్ఫ్లో మునిగిపోయిందని యెమెన్లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM) చెప్పింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, యెమెన్ తీరం మధ్య సముద్రమార్గంలో ప్రమాదాల గురించి పదేపదే హెచ్చరించింది. ఎక్కువ మంది ఇథియోపియా, సోమాలియా నుంచి పని కోసం సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు.
వలసదారులు ప్రయాణిస్తున్న సముద్రమార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఒకటి. 2024లో యెమెన్లోకి ప్రవేశించడానికి ఏకంగా 60,000 మందికి పైగా వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని IOM తెలిపింది. గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మరణించారు. గత దశాబ్ధకాలంలో 2082 మంది వలసదారులు కనిపించకుండా పోయారు. వీరిలో 693 మంది మునిగిపోయినట్లు ధ్రువీకరించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!