Congo Boat Accidents: కాంగోలో 2 పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి
- కాంగోలో 2 పడవ ప్రమాదాలు
- 193 మంది మృతి.. పలువురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయువ్య కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 193 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వాయువ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో కనీసం 193 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారని అధికారులు, రాష్ట్ర మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈక్వేటర్ ప్రావిన్స్లో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో బుధవారం, గురువారం ఈ ప్రమాదాలు జరిగినట్లుగా పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం లుకోలెలా ప్రావిన్స్లోని కాంగో నది వెంబడి దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ మంటల్లో చిక్కుకుని బోల్తా పడిందని కాంగో మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో 107 మంది చనిపోగా.. 209 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
అలాగే ఒక రోజు ముందు ప్రావిన్స్లోని బసంకుసు ప్రాంతంలో మోటారుతో నడిచే పడవ బోల్తా పడి 86 మంది మరణించారని.. ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని మీడియా తెలిపింది. చాలా మంది గల్లంతయ్యారని పేర్కొంది. ఆ సంఖ్య మాత్రం తెలియజేయలేదు. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియజేయలేదు.
ఇది కూడా చదవండి: AP New Bar Policy: ఫలించని ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు.. కొత్త బార్ పాలసీ గడువు మరోసారి పొడిగింపు
అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపించాయి. ఆఫ్రికా దేశంలో పడవలు బోల్తా పడటం తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తుంటారు. రోడ్డు రవాణా కంటే జలరవాణానే చౌకగా దొరుకుతుంది. దీంతో పడవల్లో ప్రయాణిస్తుంటారు. ఎక్కువగా రాత్రిపూట ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే రాత్రిపూట ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు జరగడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుంటుంది.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!