Pakistan: ‘సింధు నాగరికత మాదే..బుద్ధుడు మా వాడే’.. పాకిస్థాన్ కొత్త నాటకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: సింధు నది… వేల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక జలధార. ఈ నది ఒడ్డునే ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన హరప్పా నాగరికత వికసించింది. అయితే ఇప్పుడు ఈ నాగరికత పేరు మరోసారి వార్తల్లోకి నిలుస్తోంది. కారణం చరిత్ర కాదు… పురావస్తు తవ్వకాలు కూడా కాదు… భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జల వివాదం.
మొహెంజోదారోలో పురావస్తు పరిశోధనలు:
2025లో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేసింది. సరిహద్దు దాటి ఉగ్రవాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో పాత ఒప్పందాలు యథాతథంగా కొనసాగలేవని స్పష్టం చేసింది. ఆ నిర్ణయం తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. అదే సమయంలో పాకిస్థాన్లో మరో ఆసక్తికర పరిణామం కనిపించింది. దాదాపు ఆరు దశాబ్దాలుగా పెద్దగా తవ్వకాలు జరగని మొహెంజోదారోలో పురావస్తు పరిశోధనలు ప్రారంభమయ్యాయి. వేల ఏళ్ల నాటి ఆ నగరం ఒక్కసారిగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. చరిత్రకారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థలు అందరూ సింధు నాగరికత గురించే మాట్లాడటం మొదలుపెట్టారు.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చారు. మొహెంజోదారో, హరప్పా లాంటి నాగరికతలు తమ భూభాగంలో ఉన్నాయని, సింధు నాగరికతకు పాకిస్థానే నిజమైన సంరక్షకుడని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని కేవలం రాజకీయ నిర్ణయంగా కాకుండా, సింధు నాగరికత వారసత్వంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Also Read
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
- Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో సింధు నాగరికత, మెహర్గఢ్, గాంధార నాగరికతలను పాకిస్థాన్ చరిత్రలో కీలక భాగాలుగా ప్రస్తావించారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన నాగరికతల సెంట్రిక్గా పాకిస్థాన్ను అభివర్ణించారు.
తక్షశిలకు ప్రాధాన్యం:
నిజానికి దశాబ్దాల పాటు పాకిస్థాన్ అధికారిక చరిత్రలో ప్రధానంగా ఇస్లామిక్ యుగానికే ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు మాత్రం తక్షశిల, గాంధార, మెహర్గఢ్, మొహెంజోదారో లాంటి ఇస్లాంకు పూర్వం ఉన్న నాగరికతలను జాతీయ గుర్తింపులో భాగంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. తక్షశిలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, గాంధార బౌద్ధ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం, సింధు నాగరికతపై డాక్యుమెంటరీలు రూపొందించడం లాంటి కార్యక్రమాలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. సింధు నది చుట్టూ నిర్మితమైన నాగరికతకు పాకిస్థానే సహజ వారసుడనే భావనను ప్రపంచానికి తెలియజేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఈ వాదనను అందరూ అంగీకరించడం లేదు. ఎందుకంటే హరప్పా నాగరికత విస్తీర్ణంలో ఎక్కువ భాగం నేటి భారత భూభాగంలో కూడా ఉంది. అనేక పురావస్తు కేంద్రాలు రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ప్రాంతాల్లో వెలుగుచూశాయి. అందుకే పలువురు పరిశోధకులు దీన్ని కేవలం సింధు లోయ నాగరికతగా కాకుండా సింధు-సరస్వతి నాగరికతగా కూడా చెబుతుంటారు.
అంతేకాదు, ఆధునిక ప్రపంచంలో జల హక్కులను చరిత్ర నిర్ణయించదు. వేల ఏళ్ల క్రితం ఎవరు, ఎక్కడ నివసించారనే విషయం కంటే, నేటి అవసరాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, వాతావరణ మార్పులు, నీటి లభ్యత లాంటి అంశాలే కీలకం. అందుకే మొహెంజోదారో పేరును ఎంతగా ప్రస్తావించినా, హరప్పా నాగరికతను ఎంతగా గుర్తుచేసినా, సింధు జలాల భవిష్యత్తు మాత్రం చారిత్రక భావోద్వేగాల కంటే రాజకీయ నిర్ణయాలు, దౌత్య చర్చలు, ప్రస్తుత వాస్తవాల ఆధారంగానే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు సింధు నది చుట్టూ జరుగుతున్న పోరాటం కేవలం నీటి కోసం మాత్రమే కాకుండా.. చరిత్ర కోసం, వారసత్వం కోసం, ప్రపంచం ముందు తమ కథనాన్ని బలంగా వినిపించుకోవడం కోసం కూడా. ఇలా ఒకవైపు వేల ఏళ్ల నాగరికత శిథిలాలు… మరోవైపు ఆధునిక భౌగోళిక రాజకీయాల మధ్య సింధు నది కథ మరోసారి కొత్త మలుపు తిరుగుతోంది.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!