NTV Telugu Site icon

SSC MTS పరీక్ష 2023: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 11 లక్షల మంది అభ్యర్థులు గైర్హాజరు..!

Exams

Exams

SSC MTS పరీక్ష 2023: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. బీహార్ మరియు యుపీ రాష్ట్రాలలో 19,04,139 మంది విద్యార్థులు SSC MTS పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో 7,79,086 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థులు 11.25 లక్షల మంది ఉన్నారు.

Read Also: Protest Against Somu Veerraju: సోము వీర్రాజుకు నిరసన సెగ.. ప్రత్యేక హోదా ఏది..? విశాఖ ఉక్కు సంగతేంటి?

ఎక్కడెక్కడ ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారంటే..?

ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది కేంద్రాలలో 120131 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 49915 మంది (41.55 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఆగ్రాలోని ఏడు కేంద్రాల్లో 116353లో 48620, అలీఘర్ లోని ఒక కేంద్రంలో 22899లో 5918, బరేలీ త్రీ సెంటర్‌లో 51230 అభ్యర్థులు నమోదు చేసుకోగా 19910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఘజియాబాద్‌లోని మూడు కేంద్రాల్లో 49944లో 14426, గోరఖ్‌పూర్‌లో మూడు కేంద్రాల్లో 57752లో 23551 హాజరయ్యారు.
209036లో 11 కేంద్రాలలో కాన్పూర్ 81303.. లక్నో 17 సెంటర్‌లో 244332 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 85872 మంది.. బీహార్‌లోని అర్రాలో ఒక కేంద్రంలో 12825 అభ్యర్థులకు 5838, భాగల్‌పూర్‌లో రెండు కేంద్రాల్లో 34736, 17142 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!

SSC MTS పరీక్ష 2 దశల్లో నిర్వహించారు. మొదటి దశ మే 2 నుంచి మే 19 వరకు జరగ్గా.. రెండో దశ జూన్ 13 నుంచి జూన్ 20 వరకు నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ‘కీ’ పేపర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని గమనించాలని అధికారులు సూచించారు.