Site icon NTV Telugu

మైనర్‌పై అత్యాచారం కేసు.. వైసీపీ నేతను అరెస్ట్ చేసిన పోలీసులు

గుంటూరు జిల్లాలో సంచ‌ల‌నంగా మారిన మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. బాలిక‌పై అత్యాచారం కేసులో వైసీపీ నేత కన్నా భూశంకర్ ని అరెస్ట్ చేసిన అరండ‌ల్‌పేట పోలీసులు.. భూ శంకర్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్టుగా చెబుతున్నారు.. ఇక‌, ఇదే కేసులో గతంలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా.. తాజా అరెస్ట్‌ల‌తో క‌లిసి మొత్తం అరెస్ట్ అయిన‌వారి సంఖ్య 24 మందికి చేరంది.. ప్ర‌స్తుతం భూ శంక‌ర్.. గుంటూరు జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.

Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వారానికి ఐదు రోజులే ప‌ని..

Exit mobile version