NTV Telugu Site icon

Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..

Up Oil Tanker

Up Oil Tanker

*-ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని లీలాపూర్ ప్రాంతంలో ఆటోను గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా తొమ్మిది మంది మృతి చెందారు.. లారీ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..

ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. జెత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవపూర్ నివాసి, 26 ఏళ్ల ఆటో డ్రైవర్ సతీష్ గౌతమ్ తన వాహనంలో 15 మంది ప్రయాణికులను మోహన్‌గంజ్‌కు తీసుకువెళుతున్నాడు. లీలాపూర్ ప్రాంతంలోని విక్రమ్‌పూర్ మలుపు దగ్గర కు ఆటో వారణాసి-లక్‭నవూ హైవేపై ఎదురుగా వస్తున్న ట్యాంకర్ స్టీరింగ్‌ పై నియంత్రణ కోల్పోయింది.. దాంతో వేగంగా వచ్చి ఆటోను లారీ ఢీ కొట్టి బోల్తా పడింది..

ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఆరుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంబులెన్స్ డ్రైవర్లు వారి మృతదేహాలతో ప్రతాప్‌గఢ్‌కు తిరిగి వచ్చారు.. మృతుల లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. స్థానికంగా మృతుల బంధువుల రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. పోలీసులు కూడా అతి వేగం వద్దని ఎంతగా చెప్పినా కూడా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..