Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ పౌరుడు రూ. 5.5 కోట్ల విలువైన 115 బంగారు బిస్కెట్లను తన ప్యాంటులో దాచుకుని నడుస్తూ పట్టుబడ్డాడు.
ఆ వ్యక్తి శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కొంతమంది అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. ఈ సమాచారంతో అధికారులు విమానాశ్రయంలో నిఘాను తీవ్రం చేశారు.
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
సదరు ప్రయాణికుడు విమానం దిగగానే, కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు అతని కదలికలను నిశితంగా గమనించారు. ఆ వ్యక్తి ఎటువంటి తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బయటపడటానికి ప్రయత్నించాడు. కానీ, అతని ప్రవర్తన, నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అడ్డుకుని ప్రశ్నించారు.
సాక్షుల సమక్షంలో అతడు ధరించిన ప్యాంటును.. అతని సామాగ్రిని పూర్తిగా తనిఖీ చేయగా.. దాదాపు 3.5 కిలోల బరువున్న 115 బంగారు బిస్కెట్లు దొరికాయి. 24 క్యారెట్ల ఈ బంగారాన్ని అతను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బెల్ట్, ప్యాంటు లోపలి జేబుల్లో ఎవరికీ అనుమానం రాకుండా దాచాడు.
అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ముఠా ఉందా అనే కోణంలో అతని ఫోన్, ప్రయాణ వివరాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అతను కేవలం ఒక బంగారాన్ని చేరవేసే వ్యక్తి(క్యారియర్) మాత్రమేనని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారంపై దిగుమతి సుంకం పెరగడం వల్లే ఇలాంటి స్మగ్లింగ్ కేసులు ఎక్కువవుతున్నాయని, అందుకే విమానాశ్రయాల్లో సరికొత్త సాంకేతికతతో తనిఖీలను మరింత కఠినతరం చేశామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!