Chiken Fight: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు.. చికెన్ కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం ఏంటీ..

  • చికెన్ ఫ్రై లేదని కొట్టుకున్న బంధువులు
  • మూడు సార్లు ఆపేసిన పెళ్లి
  • పోలీసుల సమక్షంలో జరిగిన పెళ్లి
Untitled Design (4)

Untitled Design (4)

ఉత్తర ప్రదేశ్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ విందులో చికెన్ ఫ్రై లేదని బంధువులు పొట్టు పొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 15మంది వరకు గాయపడడ్డారు. వెంటనే వివాహా వేడుకను ఆపేశారు బంధువులు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: Kadai: ఎవడ్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. హెల్మెట్ కు బదులు ఏం పెట్టుకున్నాడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నుండి ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహంలో రుచికరమైన చికెన్ ఫ్రై ఎంత సంచలనం సృష్టించిందంటే వివాహ వేడుకను మూడుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఆహారం వడ్డించే విషయంలో జరిగిన చిన్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది, సుమారు 15 మంది గాయపడ్డారు. ఈ గొడవ చివరికి పోలీసుల సమక్షంలో వధూవరుల వివాహం ఘనంగా జరిగింది.

Read Also:Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..

బిజ్నోర్‌లోని మజేదాలోని టిబ్రి గ్రామంలోని ఫలక్ మ్యారేజ్ హాల్‌లో నాగినా ప్రాంతంలోని కోట్రాకు చెందిన వివాహ బృందానికి, వధువు కుటుంబానికి మధ్య ఈ గొడవ జరిగింది. పెళ్లి బృందం తమకు తక్కువ వేయించిన చికెన్ వడ్డిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో అమ్మాయి తరపు వారు చికెన్ నిండిన ప్లేట్లను వడ్డించడం ప్రారంభించారు. ఇది వివాహ బృందంలోని కొంతమంది సభ్యులకు కోపం తెప్పించింది. దీంతో వివాహ బృందం సభ్యులు “మర్యాదగా ఆహారం వడ్డించండి!” అని డిమాండ్ చేస్తూ గొడవ సృష్టించారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది.

Read Also:Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే కొద్దిసేపటికే మళ్ళీ గొడవ మొదలైంది. నిజానికి, భోజనం ముగిసిన తర్వాత, పెళ్లి బృందం మళ్ళీ చికెన్ డిమాండ్ చేయడంతో.. అది మరో ఘర్షణకు దారితీసింది. పోలీసులు మళ్ళీ జోక్యం చేసుకోవలసి వచ్చింది. చివరకు, ముస్లిం మత పెద్దలు, పోలీసు అధికారుల మధ్యవర్తిత్వంతో, వధూవరులు వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ విషయంపై ధర్యాప్తు చేపట్టారు.