Site icon NTV Telugu

LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..

Gas Theft

Gas Theft

LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ‘‘చమురు మంటలు’’ రేపుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10 శాతం ఎల్‌పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం చెప్పింది.

Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.!

ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు దొంగలు LPG) సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేశారు. ఈ ట్రక్కులో రూ. 18 లక్షల విలువైన 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. పోలీసులకు ట్రక్కు కోసం వెతకగా, ఖాళీ ట్రక్కు దర్శనమిచ్చింది. చోరీకి గురైన సిలిండర్ల కోసం వెతుకుతున్నారు.

ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు యజమాని నీరజ్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. మార్చి 2న ప్లాంట్ నుంచి 524 సిలిండర్ల లోడ్‌తో కాన్పూర్ దేహత్ వెళ్లాల్సి ఉంది. హోలీ పండగ కారణంగా డ్రైవర్ రాజ్‌కుమార్ ట్రక్కును ప్లాంట్ బయట నిలిపేసి ఇంటికి వెళ్లాడు. మార్చి 6న ఆ ట్రక్కు పారీచా సమీపంలోని హైవే పక్కన ఖాళీగా కనిపించింది. లారీలోని జీపీఎస్ కూడా ధ్వంసమైనట్లు గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్లను వెతకడానికి ప్రత్యేక టీంలను పోలీసులు రంగంలోకి దించారు.

Exit mobile version