Site icon NTV Telugu

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 130కి.మీ వేగంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపైకి దూసుకెళ్లిన కారు..

Road Accident

Road Accident

Road Accident: తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను 130 కిలోమీటర్ల వేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్‌లో తిరుపతికి చెందిన ఎస్‌.లావణ్య(23), కేరళకు చెందిన లక్ష్మి(24) అనలిస్టులుగా పనిచేస్తున్నారు. ఈ ఐటీ కారిడార్‌లో కంపెనీలు అధికంగా ఉండటం వల్ల రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో లావణ్య, లక్ష్మి బుధవారం రాత్రి 11.30గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్‌ వద్ద అటుగా వస్తున్న కారు అదుపుతప్పి వారికిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Rajasthan: 200 అడుగుల బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి..

కారు అదుపుతప్పడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ మోహిత్‌కుమార్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్‌లు లేకపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్‌ మధ్యలో రోడ్లు దాటడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిగ్నల్ సేఫ్టీతో జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని, పాదచారులకు ఓవర్‌హెడ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version