NTV Telugu Site icon

Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు

Up

Up

తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ… వాళ్లకోసం ఏం చేయాలీ… ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. కానీ.. అలాంటి తల్లులకు పిల్లలు ప్రస్తుతం మర్యాద ఇవ్వడం లేదు. రెక్కలొచ్చాక కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో హత్యాయత్నం సంచలనం సృష్టించింది. మేకను అమ్మే విషయమై గొడవపడి కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు బచ్రా గ్రామంలో చోటుచేసుకుంది. మేకలను అమ్మడంపై జరిగిన గొడవలో..తన 50 ఏళ్ల మాతృమూర్తిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

READ MORE: UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్

శుక్రవారం రాత్రి తల్లి దేవి -కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ మధ్య మేకను అమ్మే విషయంపై గొడవ తలెత్తింది. తల్లి దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన కమలేష్ ఓ పరికరంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతటితో ఆగకుండా కుమారుడు తన తల్లి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమె కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ ఆమెను బట్టల కింద దాచి పెట్రోలు పోసి నిప్పంటించాడని అదనపు ఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి పరిగెత్తి మంటలను ఆర్పివేశారని, అయితే అప్పటికే మహిళ చనిపోయిందని చెప్పారు. హత్య కేసులో మహిళ కుమారుడు కిషున్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.