తన డబ్బు తిరిగి అడిగినందుకు ఒక దళిత మహిళను సర్పంచ్ ప్రతినిధి కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. నివారీ జిల్లా పృథ్వీపూర్ జనపద్ పరిధిలోని మనేత గ్రామంలో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో అతడిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అతడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో .. ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన సర్పంచ్ భర్త ఆమెపై దాడి చేశాడు. వీడియోలో ఆ మహిళ నేలపై పడి ఉండగా, ఆ వ్యక్తి ఆమె చేతులను ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో నిరంతరం చెంపదెబ్బ కొట్టాడు. 74ఏళ్ల వయసున్న శాంతి అహిర్వార్ పీఎం ఆవాస్ యోజన కింద తన ఇల్లు గురించి ప్రశ్నించగా.. ముసలావిడ అనే కనికరం లేకుండా చేయి మెలేసి, కింద పడేసి, తన్ని హింసించాడు.
Read Also: Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
ఈ విషయానికి సంబంధించి స్థానిక అధికారులకు వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల ఆగ్రహం, ఆగ్రహాన్ని రేకెత్తించింది, సర్పంచ్ ప్రతినిధి హింసాత్మక, దుర్వినియోగ ప్రవర్తనకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు గ్రామ సర్పంచ్ భర్త అయిన రాజ్ కుమార్ సాహూపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.
बड़ी खबर-
MP के निवाड़ी में PM आवास के हक मांगने पर 74 साल की दादी शांति अहिरवार को वहां के सरपंच राजकुमार साहू ने बेरहमी से पीटा है।पृथ्वीपुर थाना क्षेत्र के ग्राम मनेथा में 10 सितंबर की घटना है जिसका वीडियो कल से वायरल हुआ हैं।
इस मामले में सरपंच पति को गिरफ्तार कर लिया हैं। pic.twitter.com/lVY4T18MDk— रविन्द्र जाटव (@Ravindra_Jatav9) October 23, 2025
