NTV Telugu Site icon

కన్నకొడుకు చేసే పనేనా.. ఆ పని చేయలేదని తల్లి అని కూడా చూడకుండా

guntur

guntur

మద్యం మత్తు మనుషులను ఎంతటి దారుణానికైనా ప్రేరేపిస్తోంది. మద్యానికి బానిసగా మారిన వారికి మంచి, చెడు.. విచక్షణ, వివరణ లాంటివి ఉండవు.. అందుకు ఉదహరణ ఈ ఘటన.. మద్యానికి బానిసై.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడు ఒక వ్యక్తి.. ఈ దారుణ ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. వల్లూరుకు చెందిన ఈమని మహాలక్ష్మీ అనే మహిళకు ఇద్దరు కుమారులు.. ఇద్దరిని పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి ఛేదనడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. మహాలక్ష్మీ కొడుకుల్లో ఒకరైన ప్రభాకర్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు. నిత్యం మద్యం తాగుతూ కుటుంబాన్ని గాలికి వదిలేశాడు. తాగడానికి డబ్బులు కోసం తల్లి ఇంటికి వస్తూ, ఆమె వద్ద ఉన్న డబ్బును పట్టుకొనిపోయేవాడు. ఇక ఈ బుధవారం కూడా తల్లి దగ్గరికి వచ్చిన ప్రభాకర్ తాగడానికి డబ్బులు అడిగాడు.. మహాలక్ష్మీ తన దగగ్ర డబ్బులు లేవని తెగేసి చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రభాకర్ .. పక్కనే ఉన్న రోకలిబండతో తల్లి తలపై మోది హత్యచేశాడు. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సోదరుడు సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పరారీలో ఉన్న ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.