NTV Telugu Site icon

Karnataka: భార్యతో గొడవ.. తల నరికి, ముక్కలు ముక్కలు చేసిన భర్త..

Crime

Crime

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. తుమకూరులో ఓ వ్యక్తి భార్యను దారుణం హతమార్చి, తలను శరీరం నుంచి వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. జిల్లాలోని హోస్పేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళను 32 ఏళ్ల పుష్ఫగా గుర్తించారు. నిందితుడైన భర్త శివరామ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Gambhir-SRK: బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌.. మన్నత్‌లో షారుక్‌తో గంభీర్‌ పలుమార్లు భేటీ!

సోమవారం రాత్రి భార్యతో గొడవ జరిగిన తర్వాత శివరాం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పుష్ప తల నరికేసి వంటగదిలో ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. బాధితురాలు పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణం. దంపతులు 8 ఏళ్ల చిన్నారితో కలిసి ఒక అద్దె గదిలో నివసిస్తు్న్నారు. నిందితుడు శివరాం సామిల్‌లో వర్కర్‌గా పనిచేస్తు్న్నాడు. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరగుతున్నట్లుగా విచారణలో తేలింది.