Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!
- నకిలీ డాక్టర్ల కిడ్నీ రాకెట్
- డిగ్రీ లేకుండా వందల ఆపరేషన్లు
- పేదలే బలిపశువులు
- పలు రాష్ట్రాల్లో విస్తరించిన నెట్వర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. కానీ ఉత్తరప్రదేశ్లో కొందరు కేటుగాళ్లు దీన్ని ఒక మాఫియాగా మార్చేశారు. ఎటువంటి మెడికల్ డిగ్రీలు లేవు, కనీసం ఆపరేషన్ థియేటర్ నిబంధనలు తెలియవు. అయినా చేతిలో కత్తి పట్టి వందలాది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలు చేసేశారు. కాన్పూర్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టురట్టు అయింది.
ఈ కిడ్నీ రాకెట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ముదస్సర్ అలీ. ఇతనికి ఎలాంటి వైద్య అర్హతలు లేవు. కానీ ఒక అనుభవజ్ఞుడైన సర్జన్ లాగా ఆపరేషన్లు చేసేవాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవరినీ లోపలికి రానివ్వకుండా, కిడ్నీ తీయడం నుండి దానిని మరొకరికి అమర్చడం వరకు మొత్తం ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేసేవాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఇతను ఒక్కడే 100కు పైగా నకిలీ ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఈ ముఠాలో మరో కీలక వ్యక్తి రోహిత్. ఇతను కేవలం 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు మాత్రమే చదివాడు. కానీ తెల్లటి కోటు, స్టెతస్కోప్ ధరించి డాక్టర్లా నటించేవాడు. దాదాపు 30కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేసినట్లు ఇతను అంగీకరించాడు. ఒక్కో ఆపరేషన్కు రూ. 18 లక్షల వరకు వసూలు చేసి, ఆ డబ్బును తన నెట్వర్క్లోని ఇతరులతో పంచుకునేవాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి గోవా, షిమ్లా, మనాలీ మీదుగా నేపాల్కు పారిపోగా, ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
డబ్బు కోసం కిడ్నీ అమ్ముకోవాలనుకునే పేదలను, జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చు చేసే ధనవంతులను ఈ ముఠా అనుసంధానించేది. ఒక బాధితుడికి ఇస్తామన్న రూ. 10 లక్షలు ఇవ్వకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ డాక్టర్లు చేసిన ఆపరేషన్ల వల్ల బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. పారుల్ అనే మహిళ లక్షలు ఖర్చు చేసినా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడగా, మరో ఘటనలో ఒక మహిళ ఆపరేషన్ విఫలమై ప్రాణాలు కోల్పోయింది.
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
ఈ కిడ్నీ దందా కేవలం కాన్పూర్కే పరిమితం కాలేదు. పలు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, మధ్యవర్తులు మరియు నకిలీ డాక్టర్లతో కూడిన ఒక భారీ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బయటపడినవి కొన్ని మాత్రమేనని, ఇంకా వందలాది ఆపరేషన్లు రికార్డుల్లో లేకుండా జరిగి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతోమంది కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు, వారి కోసం వేట కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?