NTV Telugu Site icon

Chennai: “ట్రాన్స్‌జెండర్ లవ్ స్టోరీ”.. ప్రేమను ఒప్పుకోలేదని నందిని దారుణ హత్య..

Chennai Murder

Chennai Murder

Chennai: తమిళనాడులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృ‌ష్టించింది. నందిని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది.

Read Also: KCR: రోడ్డు ప్రమాద ఘటనలపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా చెల్లించాలని..!

మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్‌గా మారి తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశారు. అప్పటి నుంచి నందిని, వెట్రిమారన్ నుంచి తప్పించుకు తిరుగుతోంది. నందిని రాహుల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు.

వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్‌ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొచ్చి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.