Hyderabad Crime: మహిళ ‘చిత్రాల’ మోజు.. టోకరా వేసిన ఇన్స్టా స్నేహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Man Cheated Software Engineer In The Name Of Investment: సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. మాయమాటలతో మహిళలతో పరిచయం పెంచుకొని, వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకుంటారు. మహిళలు సైతం వారి మోసాన్ని పసిగట్టలేక.. వారి వలలో చిక్కుకుంటుంటారు. కొందరు తెలివిగా తప్పించుకుంటారు కానీ, మరికొందరు మాత్రం అసలు విషయాన్ని గ్రహించేలోపే మోసపోతారు. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా.. ఈ సోషల్ మీడియా మోసానికి టార్గెట్ అయ్యింది. తనకున్న పెయింటింగ్ మోజులో, తాను మోసపోతున్నట్టు ఆమె గ్రహించలేకపోయింది. చివరికి తాను మోసపోయిన విషయాన్ని అర్థం చేసుకొని.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్లోని సోమాజిగూడలో నివాసం ఉండే ఒక మహిళ.. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఖాళీ సమయాల్లో ఈమెకు పెయింటింగ్ వేయడం అలవాటు ఉంది. ఆ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన ఓ కేటుగాడు, ‘మీరు వేసిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి’ అంటూ మాటలు కలిపాడు. ఈ క్రమంలోనే ఆమెను ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపుకి రప్పించాడు. ఆ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని.. మీ పెయింటింగ్స్ అందులో పెడితే మంచి గిరాకీ వస్తుందని నమ్మించాడు. అయితే.. ఆ వెబ్సైట్లో ముందుగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని, ఆ తర్వాత పెయింటింగ్స్కి డిమాండ్ వస్తే లక్షలు వస్తాయని చెప్పాడు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
ఆ కేటుగాడి మాటలు నమ్మిన ఆ ఇంజినీర్.. ఆ వెబ్సైట్లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఇంకేముంది.. తాను వేసిన గాలంలో చేప చిక్కిందనుకొని, అతడు ఆమె నుంచి మరింత డబ్బు లాగాడు. లాభాలు రావాలంటే.. ట్యాక్స్లు, కమీషన్లు కట్టాలంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 8 లక్షలు దోచేశాడు. ఇంకా ఏవేవే పేర్లు చెప్తూ, వాటిక్కూడా డబ్బులు కట్టాలని అతడు వెంటపడటంతో.. ఆమెకి డౌట్ వచ్చింది. చివరికి తాను నిండా మోసపోయానని గ్రహించి.. సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!