Husband Stabbed Wife: కలిసి బతుకుదామన్నాడు.. కాసేపట్లోనే గొంతు కోసేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Stabbed Wife To Death In Karnataka Family Court After Councelling: భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కొందరు వాటిని అప్పటికప్పుడే పరిష్కరించుకుంటే.. మరికొందరు మాత్రం ‘ఇగో’కి పోయి ఆ గొడవల్ని మరింత పెద్దగా చేసుకుంటారు. అప్పుడది అనూహ్య పరిణామాలకి దారి తీస్తుంది. అలాంటిదే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల పాటు సంసార జీవితాన్ని సాఫీగానే సాగించిన ఓ జంట.. కొంతకాలం నుంచి విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. విడాకుల కోసం కోర్టుమెట్లెక్కిన ఆ జోడీ.. కౌన్సిలింగ్లో భాగంగా కలిసి ఉందామని అనుకున్నారు. కానీ, ఇంతలోనే భర్త కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసేశాడు. కర్ణాటకలోని హాసన్ జిల్లా హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హసన్ జిల్లాకు చెందిన శివకుమార్కు ఏడేళ్ల క్రితం చైత్ర అనే మహిళతో వివాహమైంది. ఏడేళ్ల వరకూ వీళ్ల దాంపత్య జీవితం సజావుగానే సాగింది. అయితే.. కొంతకాలం క్రితం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో దూరంగా ఉంటున్నారు. చివరికి తమ మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు సమసిపోవని గ్రహించి.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో కోర్టు అధికారులు వారిని పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. విభేదాల్ని పరిష్కరించుకొని, కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించమని సూచించారు. మొదట్లో అంగీకారం తెలపలేదు కానీ.. ఫైనల్గా ఇద్దరు కలిసి ఉంటామని అధికారులకు చెప్పారు. దీంతో.. కాసేపు మాట్లాడుకోవడం కోసం ఆ ఇద్దరిని ఏకాంతంగా వదిలేశారు. కౌన్సిలింగ్ గది నుంచి బయటకు వచ్చాక.. ఆవరణలో నిలబడి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం చైత్ర అక్కడి నుంచి బాత్రూం కోసమని వెళ్లింది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
అప్పుడే శివకుమార్ ఆమెపై ఒక్కసారిగా ఎగబడ్డాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి తీసుకొని, చైత్ర గొంతు కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు శివకుమార్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అటు.. రక్తపు మడుగులో ఉన్న చైత్రను ఆసుపత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అదుపులోకి తీసుకున్న శివకుమార్ని.. ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? కౌన్సిలింగ్ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన సంబాషణలేంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అసలు కోర్టు ఆవరణలోకి శివకుమార్ కత్తిని ఎలా తీసుకొచ్చాడన్నది కూడా మిస్టరీగా మారింది.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!