Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్

  • గుజరాత్ నుంచి రాజస్థాన్ కు వచ్చిన కొంత మంది పర్యాటకులు
  • హోటల్ బస చేసి బిల్ కట్టకుండా పారిపోయిన పర్యాటకులు
  • చేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు
Untitled Design (9)

Untitled Design (9)

రాజస్థాన్ సిరోహిలో జిల్లాలోని ఓ హోటల్ బాగా ఎంజాయ్ చేసిన కొందరు పర్యాటకులు బిల్ కట్టకుండా జంప్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఓ హోటల్ లో బస చేసి.. బిల్లు కట్టలేదు.. అనంతరం చెప్పా చేయకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు

Read Also: Reel With Rifle: రీల్స్ పిచ్చితో గాల్లోకి కాల్పులు.. అన్నదమ్ముల అరెస్ట్

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ నుండి కొంతమంది పర్యాటకులు హాలిడే హోటల్ అనే హోటల్‌లో బస చేసి, ఆహారం, పానీయాలు తాగి, విశ్రాంతి తీసుకున్నారు. కానీ కొంత సమయం తర్వాత ఈ పర్యాటకులు బిల్లు చెల్లించకుండా హోటల్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ పర్యాటకులు హోటల్‌లో మొత్తం రూ. 10,900 బిల్లు కట్టి, లగ్జరీ కారులో పారిపోవడం ప్రారంభించారు. హోటల్ నిర్వాహకుడు వారిని బిల్లు చెల్లించమని చాలా సార్లు అడిగారు. కానీ ఈ పర్యాటకులు బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కొంత సమయం తర్వాత ఈ పర్యాటకులు తమ లగ్జరీ కారులో పారిపోయారు. దీంతో హోటల్ యజమాని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.

Read Also:old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు..

వేగంగా స్పందించిన పోలీసులు.. అంబాజీ రోడ్ సమీపంలో పర్యాటకుల కారును అడ్డుకున్నారు. యజమానికి డబ్బులు చెల్లించాలని సూచించారు. దీంతో పూర్తి బిల్ పే చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పారిపోవడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారిని శిక్షించాలని మరికొందరు సూచిస్తున్నారు.