Bengaluru: “సార్, నేను లవ్ జిహాద్, మతమార్పిడి బాధితురాలిని రక్షించండి”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి కూడా బెంగళూర్ లోనే ఓ టెక్ కంపెనీలో పనిచేస్తుంది.
అయితే వీరిద్దరు వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారు. కాగా, అష్రఫ్ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాలని వేధిస్తున్నాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు పెళ్లిని సాకుగా వాడుకున్నాడని యువతి ఆరోపిస్తోంది. అష్రఫ్ తనను ‘అసహజ లైంగిక చర్యలు’ పెట్టుకోవాలని బలవంతం చేశాడని, అతని సోదరుడితో ఫోన్ లో బెదిరించాడని యువతి ఆరోపించిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
Read Also: Team India: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్.. వరల్డ్ కప్ కష్టమే..!
సెప్టెంబర్ 6న యువతి ఎక్స్(ట్విట్టర్)లో తన బాధను వెల్లగక్కడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ పోలీసులు, పీఓంఓ ఆఫీసును ట్యాగ్ చేస్తూ.. ‘‘సార్, నేను లవ్ జిహాద్, అత్యాచారం, అసహజ సెక్స్, బలవంతమపు మతమార్పిడి బాధితురాలిని. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే బెంగళూర్ పోలీసులు సాయం చేయండి’’ అంటూ పోస్ట్ చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 7న బెల్లందూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగడంతో తరువాత కేసును బదిలీ చేశారు. సెప్టెంబర్ 14న నిందితుడు అష్రఫ్ పై 376 (అత్యాచారం), 377 (అసహజ నేరాలు), 506 (నేరపూరిత బెదిరింపులు), 420 (మోసం), కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు-2022 ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు శ్రీనగర్ కి ఒక పోలీస్ బృందాన్ని పంపించారు. అఫ్రఫ్ ని బుధవారం పట్టుకుని వచ్చి గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూర్ రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బల్డంది చెప్పారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..