NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

Aiadmk Worker Murdere

Aiadmk Worker Murdere

Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర బీఎస్‌పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు అన్నాడీఎంకేతో పాటు బీజేపీ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్ సర్కార్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసుపై విచారణ జరుపుతోంది.

Read Also: Womens Asia Cup Final: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్

ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో మరోసారి ఇలాంటి హత్యే జరిగింది. కడలూరులో పళనిస్వామి పార్టీ ఏఐఏడీఎంకే కార్యకర్తను నరికిచంపారు. పుదుచ్చేరి సరిహద్దులో ఈ ఘటన జరిగింది. బాధితుడిని తిరపావులియార్‌కి చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. బాగూర్ గ్రామంలో వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల వెంబడించి, దుండగులు చుట్టుముట్టి చంపారు. దుండగుల ముఠా తమ కారుతో ముందుగా పద్మనాభన్ బైకుని ఢీకొట్టి హత్య చేసినట్లు ప్రాథమిక నివేదిక పేర్కొంది. ఈ హత్యకు సంబంధించి విచారణ సాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.