Trying To Rob ATM: తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ఓ వ్యక్తి దొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని రాజస్థాన్లోని దౌసా జిల్లాకు చెందిన కమల్ (27), పర్వీన్ (20)గా అధికారులు గుర్తించారు.శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గ్యాస్ వెల్డర్తో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వారి వద్ద ఉన్న సామగ్రిని వదిలి ఇద్దరూ పారిపోయినట్లు గుర్తించారు.
Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి నిందితులను గుర్తించిన పోలీసులు, బప్రోలాలోని హర్ఫూల్ విహార్లో వారిని అరెస్టు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు.తాను దొంగతనానికి ప్లాన్ చేశానని, తన బంధువు పర్వీన్తో కలిసి గ్యాస్ కట్టర్, ఎల్పీజీ సిలిండర్, ఇతర పరికరాలను ఏర్పాటు చేసినట్లు కమల్ వెల్లడించినట్లు అధికారి తెలిపారు. పర్వీన్ తన స్నేహితురాలిని డబ్బుతో ఆకట్టుకోవాలని భావించి నేరం చేయడానికి అంగీకరించినట్లు కమల్ పోలీసులకు వెల్లడించాడు. మొదటి ఈ దొంగతనానికి కమల్ ప్లాన్ చేసి పర్వీన్కు చెప్పాడు. పర్వీన్ తన ప్రియురాలికి బహుమతులు కొని ఆకట్టుకోవచ్చని ఈ దొంగతనానికి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.