NTV Telugu Site icon

UP: యూపీలో మరో ఘోరం.. బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్‌రేప్

Uprape

Uprape

దేశంలో ఏదొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కామాంధుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. యూపీ హైవేపై కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: TSPSC: ఏళ్ల నిరీక్షణకు తెర.. గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు వాహనంలోనే సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు ఆమెను బెదిరించి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమెను కారులో కిడ్నాప్ చేసి.. హైవే వైపు తీసుకెళ్లారు. అందులో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఇంటికి వచ్చిన బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనను వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’

బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లిందన్నారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. అనంతరం కారులో ఇద్దరు అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. ఎంత సేపటికి రాకపోవడంతో సమీపంలో ఉన్న ప్రాంతాలను వెతికినట్లు చెప్పారు. కొద్దిసేపటికి కుమార్తె ఇంటికి వచ్చి జరిగిన ఘటనను చెప్పిందన్నారు. కారులో సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది.

ఇక ఈ ఘటనపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఒక నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు ఆస్పత్రికి పంపినట్లు పోలీసు అధికారి స్నేహ తివారీ తెలిపారు.